రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్రాహ్మణ మిత్ర వైఎస్

By Staff
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
హైదరాబాద్: బ్రాహ్మణ ఐక్యవేదికలో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రశంసలు కురిపించారు. నిజమైన బ్రాహ్మణ మిత్రుడు వైఎస్సేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం ఆయనే సీఎంగా కొనసాగుతారని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. బ్రాహ్మణసంఘం ఆధ్వర్యంలో ఇక్కడి ఆర్టీసీ కళ్యాణమండపంలో బ్రాహ్మణ ప్రజాప్రతినిధులను ఆదివారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఎంపీ ఆరుణ్‌ కుమార్‌ తో పాటు ఉన్నత విద్యాశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విశాఖ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ లను సత్కరించారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్‌ మాట్లాడారు. విశ్వసనీయతకు బ్రాహ్మణులు మారుపేరన్నారు. బ్రాహ్మణుల ఆశీర్వాదం వల్లే వైఎస్‌ గెలిచాడని, ఇకముందు కూడా ఆయనకు తమ ఆశీర్వాదం ఉంటుందన్నారు.

వైఎస్‌ బతికున్నంత కాలం లేదా ఆయన కోరుకున్నంత కాలం సీఎంగా ఆయనే కొనసాగుతారన్నారు. బ్రాహ్మణుల సేవలను ఉపయోగించుకున్న రాజ్యాలన్నీ చరిత్రలో బాగుపడ్డాయని, బ్రాహ్మణవాదం లేని భారత సంస్కృతి లేదని ఉండవల్లి పేర్కొన్నారు. అయితే కాశ్మీర్‌, పాలస్తీనా వంటి సమస్యలు పరిష్కారం చేయవచ్చేమో గానీ, బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించలేమన్నారు. సంఘాల మధ్య సయోధ్య లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. రాష్ట్రంలో నిరాదరణకు గురైన 5 వేల దేవాలయాలకు నెలకు రూ.2500 వంతున అందజేస్తూ పేద బ్రాహ్మణులకు వైఎస్‌ మార్గం చూపారన్నారు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X