'సాక్షి' లో ఆ భూతాలు నిజమా?
చంద్రబాబు నాయుడి హయాంలో ఒకసారి మూతబడి మళ్ళీ ప్రారంభమైన 'ఆంధ్రజ్యోతి' పత్రికలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారో బయటికి తీయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది కానీ పట్టుకోలేకపోయినట్టు కనిపిస్తోంది. దానికి కారణం కార్పొరేట్ సంస్ధల ద్వారా కాకుండా చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా బ్లాక్ మనీ పెట్టించారని కాంగ్రెస్ నాయకులు ప్రైవేటుగా విమర్శిస్తున్నారు.
మారిషస్ నిధులతో వైఎస్ జగన్ మాయా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని నేడు ఆంధ్రజ్యోతి రాసింది. పరోక్ష పద్ధతిలో ఎఫ్ డి ఐ లను మళ్ళించారని, ఆటోమేటిక్ రూపంలో నిధులు సేకరించారని ఆరోపించింది. సెబి నిషేధంలో ఉన్న ఒక కంపెనీ జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని బయటికి తీసింది.
సత్యం రామలింగరాజు బినామీ కంపెనీలు జగన్ పత్రికలో పెట్టుబడులు పెట్టాయన్నది మరో ప్రధాన ఆరోపణ. అయితే సత్యం రాజు చంద్రబాబు నాయుడు హయాంలో వందకోట్ల రూపాయలను తెలుగుదేశం ఐడి కార్డులను ముద్రించడానికి వెచ్చించిందని, మరో పదిహేను కోట్ల రూపాయలను చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్ ను అమెరికాలో చదివించడానికి సత్యం రాజు ఖర్చు పెట్టారని మరో ఆరోపణ వచ్చింది.
ఇక్కడ చంద్రబాబు, వైఎస్ ఇద్దరూ దొందూ దొందుగా కనిపిస్తున్నారు. ఎవరు ఎంత ఎక్కువ సంపాదించుకున్నారన్నదే చర్చనీయాంశం.