వైఎస్ రిటైర్మెంట్ ఎప్పుడు?
ఇప్పుడు ప్రజానాయకుడిగా మారిన రాజశేఖర రెడ్డి రిటైర్ అవుతానన్నా జనం ఒప్పుకోరేమో. కానీ వచ్చే ఐదేళ్ళలో అయినా కాంగ్రెస్ నాయకులు ధనాపేక్ష లేకుండా ప్రజల సంక్షేమం కోసం అభి వృద్ధి కోసం కృషి చేయాలని సామాన్యులు కోరుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. కెవిపి రామచంద్రరావు, వైఎస్ కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే నిత్యావసర వస్తువుల అధిక ధరలు వారికి లొంగడం లేదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య అని వారు సరి పెట్టుకుంటున్నా, జనానికి అంత నాలెడ్జి ఉండదు కదా. అధిక ధరలకు కారణం వైఎస్సేనని అనుకునే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపధ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అంత తేలిక కాకపోవచ్చు.
ప్రత్యర్ధి పార్టీలలో చిచ్చు పెట్టడం, నన్నపనేని రాజకుమారి వంటి మహిళా నాయకులపై దాడులు చేయించడం, టిడీపి దళిత ఎమ్మెల్యే రామారావుపై కక్ష సాధించడం వైఎస్ కు మంచి తెచ్చే విషయాలు కావు. కందిపప్పు కిలో వందకు ఎగబాకడం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు పరాకాష్ట. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా లోటులో కుంగిపోయి ఉంది. చిరంజీవి పార్టీని, టీఅర్ ఎస్ ను వైఎస్ చావు దెబ్బతీశారు. ఆ చిచ్చు టిడిపిలో కూడా రగులుతోంది. ఆయన ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నా మరో ఐదేళ్ళ నాటికి జనం మూడ్ ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఆయన ఇరిగేషన్ ప్రాజెఖ్తులు, సెజ్ ల మీద కాకుండా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరమేమో.