బాలయ్యకు బాపు రాజ్యం
పౌరాణిక పాత్రలకు పెట్టింది నందమూరి వంశం. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పౌరాణిక పాత్రల్లో నటిస్తూ ఆందరి మన్ననలు అందుకుంటున్నారు. సీ.ఎన్టీఆర్ వేసినన్ని పౌరాణిక పాత్రలు ఎవ్వరూ వేయటం లేదు. ఇక జూ ఎన్టీఆర్ కూడా రాముడిగా, యముడిగా వేశాడు. బాలకృష్ణ కృష్ణుడిగా, బలరాముడిగా మొన్న కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పాండురంగడిగా జీవించాడు. ఇప్పుడు బాపు దర్శకత్వంలో రాముడిగా కనిపించనున్నాడు. బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో సింహా చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే కాంబినేషన్లో తీయడానికి ఇప్పుడు బాపు సిద్ధమయ్యారు.
బాపు చిత్రాలన్నీ సామాజిక స్పృహ కలిగి ఉన్నవే. స్త్రీని చూపించటంలో బాపుని మించిన వారు లేరు. ఆయన చిత్రాల్లో నటించిన కథానాయికను బాపుబొమ్మ అనటం కద్దు. అందుకే ఆయన చిత్రంలో ఆవకాశం వస్తే ఏ కథానాయిక అయినా ఎగిరి గంతేస్తుంది. తన సుడి తిరిగినట్లేనని భావిస్తుంది. హీరోలు సైతం అలానే భావిస్తారు. భానుప్రియ, స్నేహ వంటి కథానాయికలు బాపుబొమ్మలుగా పేరుగాంచినవారే. కథానాయకులు సైతం బాపు చిత్రంలో నటించడానికి ఉత్సాహపడుతారు.