వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరుకు ఇంకా నాగబాబు దూరమే

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
ప్రజారాజ్యం పార్టీని బలోపేతం చేసి, అన్నయ్య చిరంజీవికి రాజకీయ అండదండలు అందించడానికి నాగబాబు ఇటీవల అభిమానుల సమావేశాలు ఏర్పాటు చేశారు. అభిమానులకు నమ్మకం కలిగించడానికి ప్రయత్నించారు. దీంతో నాగబాబు తిరిగి ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషిస్తారని, చిరంజీవికి తిరిగి దగ్గరయ్యారని అందరూ భావిస్తూ వస్తున్నారు. అయితే, అందులో నిజం లేదని తాజాగా బయటపడింది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజా నటించిన ఆరెంజ్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఆ విభేదాలు తిరిగి బయటపడ్డాయి. ఈ కార్యక్రమంలో నాగబాబు చిరంజీవితో ఎడమొహం పెడమొహంగానే వ్యవహరించారు. కార్యక్రమం ముగిసే వరకు కూడా చిరంజీవి వైపు నాగబాబు నేరుగా చూడలేదు. చిరంజీవి చూపుల నుంచి తప్పించుకోవడానికి ఆయన వేరే దిక్కులకు చూస్తూ గడిపేశారు.

చిరంజీవి, రామానాయుడు వంటి వారందరూ వేదిక మీద కూర్చున్న వెంటనే నాగబాబు వేదిక దిగిపోయి తన భార్య పక్కన కూర్చున్నారు. ఆరెంజ్ సినిమాకు నాగబాబు నిర్మాతగా ఉన్నప్పటికీ వేదిక దిగిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రామ్ చరణ్ తేజాను చరణ్ అని సంబోధించడం నాగబాబుకు అలవాటు. తన కన్నా చిన్నవాడిగా ఆయన అలా పిలిచేవారు. అయితే, కార్యక్రమంలో ప్రసంగించే సమయంలో ప్రత్యేకంగా చరణ్ బాబు అంటూ సంబోధించారు. చిరంజీవి ఎదుట రామ్ చరణ్ ను చొరవతో చరణ్ అని సంబోధించలేకపోయారని అంటున్నారు. దీన్ని బట్టి వారిద్దరి మధ్య దూరం తరగలేదని అర్థమవుతోందని అంటున్నారు.

కార్యక్రమం జరుగుతున్నంత సేపు చిరంజీవి తన బావమరిది అల్లు అరవింద్ తోనే గడిపారు. తన సోదరుడు నాగబాబు చిత్ర నిర్మాత కూడా అయినా చిరంజీవి పట్టించుకోలేదు. అల్లు అరవింద్ మాటలకే చిరంజీవి విలువ ఇస్తున్నారని, దాంతో నాగబాబుతో దూరం పెరిగిందని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో కూడా అదే జరుగుతోందనే అభిప్రాయం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X