వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ చేవెళ్ల చెల్లెమ్మ, ప్రియమిత్రుడు టార్గెట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy-KVP Ramachandra Rao
వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులైనవారిని మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, పి. శంకరరావు టార్గెట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రస్తుత హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల చెల్లెమ్మగా చెప్పుకునేవారు. ఏ కార్యక్రమాన్నైనా ఆమె నియోజకవర్గం నుంచే ప్రారంభించేవారు. ఆమె నియోజకవర్గం నుంచి దేన్ని ప్రారంభించినా అది విజయవంతం అవుతుందనేది ఆయన నమ్ముతూ వచ్చారు. అలాగే, కెవిపి రామచందర్ రావు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు. శరీరాలు వేరు గానీ ఆత్మలు ఒక్కటేనని చెప్పుకునేంత సన్నిహిత మిత్రులు వారు. వైయస్ రాజశేఖర రెడ్డి తెర ముందు కనిపిస్తే, తెర వెనక వ్యవహారమంతా కెవిపి నడిపారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వారిద్దరు టార్గెట్‌గా మారిన సూచనలు కనిపిస్తున్నాయి.

మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్య సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుండగా, గతంలో సిబిఐ విచారణ తీరుపై ఆసంతృప్తి వ్యక్తం చేసిన శంకరరావు కెవిపిని టార్గెట్ చేసుకున్నట్లు కనిపించారు. ఒక్క శాఖలో తప్పు జరిగితే ఆ శాఖకు సంబంధించిన మంత్రి బాధ్యత ఉన్నట్లేనని డిఎల్ రవీంద్రా రెడ్డి బుధవారంనాడు వ్యాఖ్యానించారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి మైనింగ్ లీజుల మంజూరు విషయంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఐఎఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గాలి జనార్దన్ రెడ్డి కేసుకు సంబంధించి సబితా ఇంద్రారెడ్డి కూడా బాధ్యత వహించాల్సిందేనని ఆయన మాటలు తెలియజేస్తున్నాయి.

ఇక, అధికారులను మాత్రమే సిబిఐ లక్ష్యం చేసుకుందని గతంలో పి. శంకరరావు అన్నారు. నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించినవారిని సిబిఐ పట్టించుకోవడం లేదని కూడా ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకున్న అన్ని నిర్ణయాల్లో కెవిపి రామచందర్ రావు పాత్ర ఉందనే ఆరోపణలు మొదటి నుంచీ వస్తున్న విషయం తెలిసిందే. దీన్నిబట్టి కెవిపి రామచందర్ రావుపై కూడా సిబిఐ దృష్టి పెట్టాలనే అభిప్రాయం శంకరరావు మాటల్లో వ్యక్తమైంది. మొత్తం మీద, సిబితా ఇంద్రారెడ్డి, కెవిపి రామచందర్ రావులకు సిబిఐ కేసుల వల్ల ఇక్కట్లు తప్పకపోవచ్చుననే మాట వినిపిస్తోంది.

English summary
It is said that ministers DL Ravindra Reddy and P Shankar Rao have targeted Sabitha Indra Reddy and KVP Ramachandar Rao in gali Janardhan reddy case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X