జగన్ ఇంటి వైభోగం చూసి నివ్వెరబోయిన సిబిఐ?
ఇక, జగన్ ఇల్లు, ఆఫీసులకు సంబంధించి ఎవరెవరు వస్తున్నారు? ఎవరెవరు వెళ్తున్నారనే విషయాలను గమనించడానికి 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని, వీటిని మానిటరింగ్ చేయడానికి రెండు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారని తెలిసింది. తొలి రోజు సోదాల్లో భాగంగా సీబీఐ అధికారులు ఒక కంట్రోల్ రూంను మాత్రమే గుర్తించారని తెలిసింది. రెండో కంట్రోల్ రూం ఎక్కడుందో తెలుసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జగన్ పార్టీ ఆఫీసుకు నిర్మించిన భవనంలోని మూడు అంతస్తుల్లో గ్రౌండ్ ఫ్లోర్ను పార్కింగ్, స్టాఫ్ క్వార్టర్లు, సెక్యూరిటీ కంట్రోల్ కోసం వాడారు. మొదటి అంతస్తులోని గదులను కార్యకర్తల కోసం కేటాయించారు. రెండో అంతస్తులోని 20 గదులు వీవీఐపీల కోసం కాగా, ప్రతి గది నుంచి డైనింగ్ హాల్కు వెళ్లడానికి మార్గం ఉందని సమాచారం. మాస్టర్ డైనింగ్ హాల్లో 250 మంది భోజనం చేయడానికి ఏర్పాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, మూడో అంతస్తులో జగన్కు సంబంధించిన ఆఫీసు, స్విమ్మింగ్ పూల్, లాన్ ఉన్నాయని, జగన్ తన ఆఫీసులో కూర్చుని లోటస్ పాండ్ను చూసేలా అద్దాలు ఏర్పాటు చేశారని సమాచారం.