కుటుంబ రాష్ట్ర సమితి: లోకేష్ స్టూడియో ఎన్
కెసిఆర్ మొదటినుండి ఉద్యమాన్ని ఫణంగా పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించింది. తెలంగాణ కోసమంటూ ఎంపీలుగా గెలిచి మంత్రిపదవులు తీసుకున్నారు. ముఖ్యమైన పదవులలో తమ కుటుంబ సభ్యులను కూర్చుండబెట్టారని ఆరోపించారు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో జరిగిన శాసనమండలి ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగుకు పాల్పడ్డ విషయంలో శాసనసభ్యులను మాత్రమే బలి పశువులను చేశారని ఆరోపించింది. పార్టీలో మిగిలిన వారికి తెలియకుండా వారు క్రాస్ ఓటింగుకు పాల్పడ్డారనే విషయాన్ని ప్రశ్నించింది. క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించి వారిని బలి చేశారని ఆరోపించింది. కాగా కెసిఆర్కు దగ్గరగా ఉండే మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు క్రాస్ ఓటింగ్ విషయం ముందే తెలుసు ఆనే ఆరోపణలు గమనార్హం.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కెసిఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందన్నారు. ఉద్యమం పేరుతో కుటుంబం లాభపడుతూ వ్యాపారాలు చేసుకుంటుందని ఆరోపించింది. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది మేమే అంటున్న కాంగ్రెసు పార్టీని విడిచి పెట్టి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుంటుందని ఆరోపించింది. పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ కోసం నిలదీస్తామని చెప్పిన కెసిఆర్ రెండు రోజులు మాత్రం సభలో తెలంగాణపై మాట్లాడి ఇంత వరకు వెళ్లలేదన్నారు. ఇరవై రోజులకు పైగా ఢిల్లీ వెళ్లక పోవడం వెనుక విలీనం ప్రక్రియ జరుగుతుందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. కెసిఆర్ కాంగ్రెసు పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమైన తర్వాత కాంగ్రెసును ఏమీ అనడానికి సాహసించడం లేదని ఆరోపించింది.
గతంలో కూడా తెలంగాణ ఇచ్చే కాంగ్రెసు ఇవ్వనప్పటికీ వారిని నెత్తికెత్తుకున్నారని ఆరోపించింది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాగాంధీని ఒక్కమారు అడిగిన సందర్భం లేదని ఆరోపించింది. ఒక్కసారి బజారు కీడుస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారని, అయితే అధిష్టానం నుండి మందలింపు రావడంతో మళ్లీ ఊరుకున్నారని ఆరోపించింది. టిఆర్ఎస్, కెసిఆర్ కాంగ్రెసు చేతిలోనే ఉన్నారని అన్నారు. తెలంగాణలో కెసిఆర్ అవకాశవాదం ప్రజలు తెలుసుకుంటున్నారని, తన ప్రభ తెలంగాణలో తగ్గుతున్నదని గమనించిన కెసిఆర్ విలీనం ప్రస్తావన తెరమీదకు తెచ్చారని ఆరోపించింది.