డ్రగ్ రాకెట్లో మరింత మంది సెలిబ్రిటీలు
కొకైన్తో పట్టుబడిన నాగ సిద్ధార్థ, ఫ్రెడ్రెక్ ఫోన్ కాల్స్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీటి ఆధారంగా సినీ పరిశ్రమలోని మరింత మందిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఓ ప్రముఖ నిర్మాత కుమారుడు, ఓ హీరోయిన్లతో పాటు మరింత మందికి కూడా వారిద్దరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు 2010 ఫిబ్రవరిలో 20 కిలోల ఎఫిడ్రైన్తో కెవి రావు అనే నిర్మాత పట్టుబడడంతో టాలీవుడ్ వైపు ప్రధానంగా దృష్టి మళ్లింది. ఆ తర్వాత హీరో రవితేజ సోదరులు రఘురాజు, భరత్ రాజు 2010 ఆగస్టులో ఓ వ్యాపారవేత్తతో పాటు నైజీరియన్ క్లెమెంట్ అలియాస్ విక్టర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరోయిన్, నిర్మాత జీవిత రాజశేఖర్ సోదరుడు మురళిని ఇతరులతో పాటు కొకైన్ కొనుగోలగు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఏడాది ఎప్రిల్ 1వ తేదీన ఫిల్మ్ నగర్లో సూడాన్కు చెందిన వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. దీన్నిబట్టి టాలీవుడ్కు పెద్ద యెత్తున మత్తుపదార్థాలు సరఫరా అవుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వరుణ్ సందేశ్, అభిషేక్లు కూడా డ్రగ్ రాకెట్లో చిక్కుకున్నారు. డాక్టర్ నాగ సిద్ధార్థను, నైజీరియన్ ఫ్రెడ్రెక్ను కొకైన్తో పోలీసులు అరెస్టు చేయడంతో మరోసారి కలకలం ప్రారంభమైంది.