బాబుపై మోత్కుపల్లి అసంతృప్తి వెనుక?
కానీ ఫోరం కన్వీనర్గా ఎర్రబెల్లి దయాకర రావును వరించింది. అప్పటి నుండే మోత్కుపల్లిలో అసంతృప్తి గూడు కట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే పిఏసి చైర్మన్ పదవి ఖాళీ ఉండటంతో ఆయన మరికొన్నాళ్లు ఓపిక పట్టినట్లు తెలుస్తోంది. పిఏసి చైర్మన్ పదవిని ఎవరికి ఇవ్వాలనే విషయంలో చంద్రబాబు నాయుడు తీవ్ర తర్జన భర్జనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పదవికి మోత్కుపల్లి నరసింహులు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొత్తకోట దయాకర రెడ్డి, రావుల చంద్రశేఖర రెడ్డి, నాగం వర్గం హరీశ్వర్ రెడ్డిని పరిశీలించినట్లు తెలుస్తోంది. రేవూరి, కొత్తకోట, రావులలో ఎవరికో ఒకరికి ఇస్తే మిగిలిన వారు నాగం వైపు వెళతారని పార్టీలో ఊహాగానాలు వస్తున్నట్టు సమాచారం.
అలాకాకుండా నాగం వర్గం హరీశ్వర్ రెడ్డికి పిఎసి పదవి ఇవ్వడం ద్వారా తమ వైపు తీసుకు రావాలనీ బాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలా అయితే రేవూరి, కొత్తకోట, రావుల తదితరులు నాగం వైపు చూస్తున్నారనే అనుమానం ఉంది. దీంతో ఏం చేయాలో పాలుపోక చంద్రబాబు పిఎసి పదవిని భర్తీ చేయకుండా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల తనకు ఎలాగు పిఎసి పదవి దక్కదనే ఉద్దేశ్యానికి మోత్కుపల్లి వచ్చాడని అందుకే బస్సుయాత్రపై అభ్యంతరాలు వ్యక్తం చేసి తన అసంతృప్తి వ్యక్తం చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.