సినీ పెద్దల చుట్టూ సిఐడి ఉచ్చు?

2010 సెప్టెంబర్ 6న శంఖం సినిమాకు సంబంధించి నట్టి కుమార్ను సి కల్యాణ్కు చెందిన బాలాజీ కలర్ ల్యాబ్కు పిలిపించి తుపాకీతో బెదిరించారంటూ కేసు నమోదైంది. రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టిన తనకు వీరి బెదిరింపుల కారణంగా రూ.7.5 లక్షలే అందిందని సిఐడి పోలీసులకు నట్టి కుమార్ ఫిర్యాదు చేశారు. 2009 సెప్టెంబర్ 8న పోలీసు పోలీసు అనే సినిమాకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్లో తనను తుపాకితో బెదిరించారని సి కల్యాణ్, భాను కిరణ్, వెంకటేశ్వర రావులపై నట్టి మరో ఫిర్యాదు చేశారు.
వీరిపై హత్యాయత్నంతో పాటు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు. సిఐడి అరెస్టు ఖాయమని భావించిన నిందితులు ముందస్తు బెయిలు కోసం యత్నాలు ముమ్మరం చేశారు. కాగా విశాఖపట్నంలో ఉన్న నట్టి కుమార్ను హైదరాబాద్ రప్పించి రాజీ చేసేందుకు సినీ పెద్దలు రంగంలోకి దిగారట. వీరి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారట. అప్పుడు నట్టి కుమార్ నష్టపోయిన సొమ్ము ఇప్పుడు చెల్లించేలా రాజీ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
కాగా సిఐడి అధికారులు రోజుకో సినీ నిర్మాతను పిలిపించి విచారిస్తున్నారు. బెదిరింపుల కేసులో మంగళవారం సినీ నిర్మాత భగవాన్ను పిలిపించిన సిఐడి అధికారులు ఆయనను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బుధవారం దరువు సినిమా నిర్మాత శివ రామ కృష్ణను పిలిపించి మూడు గంటల పాటు ప్రశ్నించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications