వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ముగిసిన అధ్యాయం' మళ్లీ తెరుస్తున్నారు: బాబులో అలజడి, అందుకే ఉన్నపళంగా..

|
Google Oneindia TeluguNews

అమరావతి: 'హోదా ఏమైనా సంజీవనా?.. హోదాతోనే సర్వం పరిష్కారమవుతాయని ఇంకా ప్రజలను మభ్య పెట్టడం తగదు..' సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు వేదికల మీద చేసిన వ్యాఖ్యలివి. హోదా ముగిసిపోయిన అధ్యయనం అని బీజేపీ తేల్చేశాక.. దానికే కట్టుబడి ప్యాకేజీకే పరిమితమైపోయారు చంద్రబాబు.

అప్పటినుంచి 'హోదా'పై ఆయన ప్రతికూలంగానే స్పందిస్తున్నారు. దానిపై పోరాడుతున్న వైసీపీని కూడా ఇదంతా రాజకీయాల కోసమేనని దుమ్మెత్తి పోశారు. కానీ ఇంతలోనే సీన్ మారిపోయింది..

కసి తెలుసు, ఢిల్లీతో పోరాడుతా: బాబు కీలకవ్యాఖ్య, 'కేంద్ర స్కీంల ద్వారా 1.7 శాతం నిధులు ఎక్కువ డ్రా' కసి తెలుసు, ఢిల్లీతో పోరాడుతా: బాబు కీలకవ్యాఖ్య, 'కేంద్ర స్కీంల ద్వారా 1.7 శాతం నిధులు ఎక్కువ డ్రా'

బాబులో అలజడి..:

బాబులో అలజడి..:

అధికారికంగా ప్రకటించలేదు.. కానీ ఓ చిన్న లీకు మాత్రం వదిలారు. ఏంటది?.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హోదాపై మళ్లీ గళమెత్తబోతున్నారని తెలిజేయడమే ఆ లీకు సారాంశం. హోదాపై వైసీపీ గట్టిగా నినదిస్తున్నవేళ.. చంద్రబాబులో ఎక్కడో అలజడి మొదలైనట్టే కనిపిస్తోందని అంటున్నారు.

పైగా కేంద్రాన్ని మరింత ఇరుకునపెట్టాలంటే హోదాను మించిన అస్త్రం లేదని ఆయన భావిస్తున్నట్టే తెలుస్తోంది. కాబట్టే.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఆయన నోట హోదా మాట వినిపిస్తోంది అంటున్నారు.

ఆ విషయం ఇంత ఆలస్యంగా తెలిసిందా..:

ఆ విషయం ఇంత ఆలస్యంగా తెలిసిందా..:

నిజానికి హోదా ముగిసిన అధ్యాయం కాదని, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల్లో ఆ మాటే ఎక్కడ లేదని ప్రొ.నాగేశ్వర్ లాంటి రాజకీయ, ఆర్థిక నిపుణులు పదేపదే చెబుతూనే ఉన్నారు.

కానీ చంద్రబాబు మాత్రం హోదా అనే మాటనే పూర్తిగా తెరమరుగు చేసేశారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కానీ 14వ ఆర్థిక సంఘం నిబంధనలు హోదాకు వ్యతిరేకంగా ఏమి లేవని చంద్రబాబు చాలా ఆలస్యంగా గ్రహించడం విడ్డూరం అంటున్నారు.

అధికారికంగా ప్రకటనేది?:

అధికారికంగా ప్రకటనేది?:

'హోదా'పై కూడా కేవలం లీకును మాత్రమే వదిలిన చంద్రబాబు.. ప్రజల్లో వచ్చే స్పందనను చూశాకే అధికారికంగా దానిపై మాట్లాడాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే ముందుగా మీడియాకు లీకులిచ్చి.. దానిపై కాస్త చర్చ జరిగాక.. అప్పుడు హోదాపై స్పష్టమైన ప్రకటన చేయాలనుకుంటున్నారని సమాచారం.

అందుకే యూటర్న్..:

అందుకే యూటర్న్..:

హోదాపై జగన్ దూకుడుగా అడుగులేస్తున్న వేళ.. ప్రత్యేక హోదా సాధన సమితి లాంటి సంఘాలు ఇతర రాష్ట్రాల్లోనూ కార్యాచరణకు సిద్దమవుతున్నవేళ.. ఇంకా దానిపై మౌనం వహించడం టీడీపీకి చేటు చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే హోదాపై ఆయన యూటర్న్ తీసుకున్నారని అంటున్నారు. అయితే హోదాపై పోరాటానికి సంబంధించి టీడీపీ వద్ద ప్రణాళిక ఉందా? అంటే చెప్పలేని పరిస్థితి. మరి దీనిపై చంద్రబాబు ఎలా ముందుకెళ్తారో వేచి చూడాలి.

English summary
It is learnt that Chief Minister N Chandrababu Naidu asked his party leaders to highlight how the opposition leader YS Jaganmohan Reddy had been provoking people by raising the special status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X