ట్రంప్కు రాఖీలు పంపిన మరోర గ్రామస్థులు
హర్యానాలోని మరోర అనే ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు రాఖీలు పంపారు.
గురుగావ్: హర్యానాలోని మరోర అనే ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు రాఖీలు పంపారు.
హర్యానాలోని వెనుకబడిన ప్రాంతమైన మేవాల్ పరిధిలోని మరోరా అనే గ్రామాన్ని సులభ్ అంతర్జాతీయ సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడు బిందేశ్వర్ పాఠకర్ దత్తత తీసుకొన్నారు.
ఈ గ్రామానికి ట్రంప్ అని కూడ నామకరణం చేశారు. ఆ తర్వాత జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు ఆ పేరును తొలగించారు. అనేక సామాజిక కార్యక్రమాలను ఈ గ్రామంలో ఆయన నిర్వహిస్తున్నారు.
ఈ సంస్థ సహకారరంతో ట్రంప్ చిత్రంతో కూడిన 1001 , ప్రధాని మోడీ చిత్రంతో 501 ప్రత్యేక రాఖీలు తయారుచేశారు. భారత్, అమెరికా మధ్య సోదరభావంతో కూడిన పటిష్ట బంధ: నెలకొనేందుకుగాను రాఖీలతో పాటు ఉత్తరాలను అమెరికాలోని వైట్హౌజ్కు పంపారు.
ఈ రాఖీలను ఢిల్లీకి పంపిస్తూ రక్షాబంధన్ పండుగను దేశ ప్రధాని ఇంట్లో జరుపుకోవాలని భావిస్తున్నట్టు నరేంద్ర మోడీకి లేఖ రాశారు.