గ్రీస్ సంక్షోభం: ముందుకొచ్చిన యూరోజోన్, కానీ
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన గ్రీస్కు రుణ చెల్లింపులు ఓ కొలిక్కి వచ్చినట్లుగానే కనిపిస్తున్నాయి. యూరో జోన్ లీడర్లు గ్రీస్ను గట్టెక్కించేందుకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
గ్రీస్ ఆర్థిక సంక్షోభం విషయమై యూరో జోన్ నేతలు దాదాపు పదిహేడు గంటలు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం గ్రీస్కు అండగా నిలబడాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
గ్రీస్ను ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడేసేందుకు 86 బిలియన్ యూరో డాలర్లు తీసుకునేందుకు ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ అంగీకరించారు. గ్రీస్కు షరతులతో కూడిన సాయం చేసేందుకు యూరో జోన్ నేతలు ముందుకు వచ్చారు.
యూరో జోన్ నేతలు గ్రీస్ దేశానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అలాగే, గ్రీస్ సంస్కరణల పైన కూడా దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. జర్మనీ నేతృత్వంలో యూరో జోన్ దేశాలు గ్రీస్ను బెయిలవుట్ చేసేందుకు ముందుకు వచ్చాయి. కానీ కఠినమైన షరతులు విధించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు గాను పెన్షన్ సంస్కరణలు, వ్యయాల కోత, పన్నుల పెంపు వంటివి గ్రీసు చేపట్టాలని తెలుస్తోంది.