ఇంద్రాణి: కుట్రలేదు, ఆత్మహత్యాయత్నమూ లేదు!
ముంబై: షీనా బోరా హత్య కేసు దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితురాలైన ఇంద్రాణిని శనివారం సీబీఐ అధికారులు దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు.
ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) మాట్లాడుతూ... ఇటీవల ఇంద్రాణి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవడానికి కారణం మోతాదుకు మించి మందులు తీసుకోవడం కానేకాదని స్పష్టం చేశారు.
విష ప్రయోగం అసలే కాదన్నారు. ఆమె అంతకుముందు తీసుకున్న ఔషధాలను కొద్దికాలం పాటు ఆపేయడం, తీవ్ర బలహీనతతో బాధపడుతుండటం కారణం కావచ్చని ఐజీ (జైళ్లు) అయిన బిపిన్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. అప్పుడప్పుడూ స్పృహ తప్పిపడిపోవడం ఇంద్రాణికి ఇవాళ కొత్తేమీ కాదన్నారు.
ఇంద్రాణీ ఆత్మహత్యాయత్నమూ లేదు ఏదీ లేదని పోలీసులు చెప్పడం గమనార్హం. ఆమె ఆత్మహత్యాయత్నం చేయలేదు, అలాగే ఆమె పైన కుట్ర జరిగినట్లుగా కూడా ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. ఇంద్రాణి తల్లి చనిపోయిన విషయం సైతం శుక్రవారం ఆమెకు చెప్పామన్నారు.