జంగ్ మంచి వ్యక్తి, మోడీపైనే: రూటుమార్చిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ నజీబ్ జంగ్కు ఊహించని మద్దతు లభించింది! ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ జనరల్ నజీబ్ జంగ్కు మొదటి నుంచి పడని విషయం తెలిసిందే. అయితే, అదే నజీబ్ జంగ్ పైన అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మంచి మనిషి అని కితాబిచ్చారు. ఆయన కేవలం ప్రధాని కార్యాలయం (పీఎంవో) నిర్దేశకాల ప్రకారం వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. తద్వారా గతంలో తమ మధ్య విభేదాలకు ప్రధాని కార్యాలయం అని చెప్పకనే చెప్పారనవచ్చు.
గత కొద్దికాలంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య పలు విషయాల్లో వివాదాలు చెలరేగాయి. అయినప్పటికీ కేజ్రీవాల్ ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్కు మద్దతు పలకడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఆయన పైన కేజ్రీవాల్, ఏఏపీ మండిపడింది.
గవర్నర్ నజీబ్ జంగ్ను లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తప్పించాలని కొందరు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో, శనివారం నాడు ఉదయం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో ఆయనపై ప్రశంసలు కురిపించారు.