'ధోనీ రిటైరయితే తెలిసొస్తుంది, కోహ్లీ వస్తే ఏమౌతుందో చెప్పలేం'
ముంబై: భారత జట్టుకు అన్ని ఫార్మాట్లకు ఇప్పుడే విరాట్ కోహ్లీని కెప్టెన్గా చేయడం సరికాదని, భారత క్రికెట్ స్థాయిని పెంచిన ధోనీనే మరింతకాలం కొనసాగించాలని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. ఓ గొప్ప ఆటగాడిని వైదొలగాలని తొందర పెట్టడం సరికాదన్నారు.
ధోనీ రిటైర్ అయ్యాక ఆ లోటును ఎవరూ పూడ్చలేదని, అప్పుడు తెలిసి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఎంతకాలం ఆడాలన్న నిర్ణయాన్ని ధోనీకే వదిలి వేయడం మంచిదని చెప్పాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ కావడానికి మరింత సమయం కావాలన్నాడు.
తన దృష్టిలో ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ బ్యాట్సుమెన్ కోహ్లీనే అని చెప్పాడు. విరాట్ తన జీవితంలోనే మంచి దశలో ఉన్నాడని చెప్పాడు. కోహ్లీ ఆట చూస్తే తనకు ఆనందమేస్తుందన్నాడు. ప్రత్యేకత సంపాదించుకున్నాడని చెప్పాడు. అతను బ్యాటింగుకు వస్తుంటే ఏం జరుగుతుందో ఊహించలేమన్నాడు.
అంత ప్రశాంతంగా కనిపిస్తాడని, మ్యాచులు ఎలా ముగించాలో అతనికి బాగా తెలుసునని చెప్పాడు. ఇంతకుముందు ఏబీ డివిల్లీయర్స్ అత్యుత్తమ ఆటగాడు అని అనుకునేవాడినని, స్వల్ప కాలంలోనే కోహ్లీ అతనిని గత ఏడాది దాటేశాడని చెప్పాడు.