శ్రీదేవి డెత్ మిస్టరీ: బోనీ కపూర్ మొదటి కాల్ ఆయనకే
న్యూఢిల్లీ: శ్రీదేవి మృతి కేసులో ఆమె భర్త బోనీ కపూర్ను విచారించలేదని, కేవలం ప్రశ్నించామని దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వాళ్లు బోనీ కపూర్ కాల్ డేటాను పరిశీలించినట్లు తెలుస్తోంది.
Recommended Video
కాల్ లిస్టులో ఎక్కువ సార్లు పార్లమెంటు సభ్యుడు అమర్ సింగ్ నంబర్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోది. దీనిపై ఓ జాతీయ మీడియా ఆయనను ప్రశ్నించడానికి ప్రయత్నించింది.
బాబీ ఇక లేదని చెప్పారు..
ఆ రోజు అర్థరాత్రి దాటిన తర్వాత 12 గంటల 40 నిమిషాల సమయంలో బోనీ కపూర్ తనకు ఫోన్ చేసినట్లు అమర్ సింగ్ చెప్పారు. సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉండడంతో తాను గుర్తించలేదని, తర్వాత తన ల్యాండ్ నెంబర్కు ఫోన్ చేశారని, బాబీ ఇక లేరని గద్గద స్వరంతో బోనీ తనకు చెప్పారని అన్నారు.
అలా అనుకుని ఫోన్ పెట్టేశా...
అది మాట్లాడే సందర్భం కాదని ఫోన్ పెట్టేశానని అమర్ సింగ్ చెప్పారు. బహుశా ఆ వార్త బోనీ మొదట చెప్పింది తనకే అయి ఉండవచ్చునని అన్నారు. శ్రీదేవీ, బనీ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధం ఉందని, ఇది నిజంగా ెఎవూ ఊహించని సంఘటన అని అన్నారు.
వారికి ఏ బాధలూ లేవు.
అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఇలా జరిగిందని అమర్ సింగ్ అన్నారు. వారికి అప్పులు లేవని, వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని అన్నారు. కాగా, ఆదివారం మృతదేహానికి పరీక్షలు నిర్వహించే సమయంలో ఎలా జరిగిందనే వివరణ మాత్రమే తీసుకుని బోనీ కపూర్ను హోటల్కు పంపించివేసిటన్టలు ఖలీజ్ టైమ్స్ రాసింది.
అమర్ సింగ్, బోనీ కపూర్ ఇలా..
శ్రీదేవి మరణించడానికి ముందు రోజు బోనీ కపూర్, అమర్ సింగ్ ఇద్దరూ లక్నోలో ఇన్వెస్టర్ల సమ్మిట్కు హాజరయ్యారు. అయితే, అక్కడ అమర్ సింగ్కు అవమానం జరడంతో ఆయన దాన్ని బహిష్కరించి ఢిల్లీ వెళ్లిపోయారు. బోనీ శ్రీదేవితో సర్ప్రైజ్ డిన్నర్ కోసం దుబాయ్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.