హైదరాబాద్లో 'లజ్జ': అసహనంపై తస్లీమా (వీడియో)
ఢిల్లీ: ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆదివారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఓ వీడియో షేర్ చేసింది. భారత్ లౌకికవాదులు వంచకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పైన ఓ వర్గం వారు దాడి చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆమె అందులో నిలదీశారు.
భారత దేశంలో లౌకికవాదుల పేరిట చెప్పుకునే వారు వంచనకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను రాసిన 'లజ్జ' పుస్తకాన్ని హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అమ్మకానికి పెడితే.. ముస్లిం మతాన్ని ఇష్టపడే కొందరు వచ్చి రాద్ధాంతం చేశారని చెబుతూ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
తాను రాసిన లజ్జ పుస్తకాన్ని భారత దేశంలో నిషేధించలేదనే విషయాన్ని అడ్డుకునే వారు పట్టించుకోలేదన్నారు. ఈ విషయం కూడా అసహనమేనని భారత్లోని ఏ లౌకికవాద రచయితా చెప్పలేదని, అలాగే, ఆ ఘటనకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు తాను వినలేదన్నారు.
లౌకికవాదులమనిచెప్పుకుంటున్న వారు అప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. తన పుస్తకం అమ్మకాలను అడ్డుకున్న వారు అబద్ధాలు చెబుతున్నారని, తాను ఇస్లాంను విమర్శించని అరుదైన పుస్తకం లజ్జ అని తెలిపారు.
Haven't
heard
any
secular
writer
in
India
call
this
act
of
Muslim
fanatics
'intolerance'.Watch
the
video
https://t.co/hSJSCP53TI
—
taslima
nasreen
(@taslimanasreen)
December
13,
2015
Those
Indian
Muslim
protesters
do
not
know
that
Lajja
is
banned
in
Bangladesh,
not
in
India.
https://t.co/hSJSCP53TI
—
taslima
nasreen
(@taslimanasreen)
December
13,
2015
These
people
are
liars.The
truth
is,Lajja
is
he
only
book
or
one
of
my
rare
books
in
which
I
havn't
criticized
Islam
https://t.co/8PzreFYD4L
—
taslima
nasreen
(@taslimanasreen)
December
13,
2015