బాబును కలిసిన చిరంజీవి కోడలు ఉపాసన (పిక్చర్స్)
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి కోడలు ఉపాసన శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు! హైదరాబాదులోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఉపాసనతో పాటు అపోలో హాస్పిటల్స్ గ్రూప్కు చెందిన ప్రతినిధులు కలిశారు.
అపోలో ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ సీ ప్రతాప్ రెడ్డి, ఉపాసన తదితరులు చంద్రబాబును లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో హెల్త్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వపరంగా సహకరిస్తామని చంద్రబాబు వారికి తెలిపారు.
హెల్త్ సిటీ ఏర్పాటుకు భూమి, నీరు, విద్యుత్ ఇతర మౌలిక వసతులకు సంబంధించిన అనుమతులు సత్వరమే మంజూరు చేయించాలని కోరారు. అన్ని సత్వరమే వస్తే పద్దెనిమిది నెలల్లో హెల్త్ సిటీని పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వపరంగా సహకరిస్తామని చెప్పారు. కాగా, ఉపాసన అపోలో చారిటీ వైస్ చైర్మన్గా ఉన్నారు.