ఏమిటీ ఐఎన్ఎక్స్ కేసు: కార్తీతో ఇంద్రాణి, పీటర్ లింక్
Recommended Video
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరాన్ని సిబిఐ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. క్రిమినల్ కుట్ర కింద సిబిఐ ఇంతకు ముందు కార్టి, ఇంద్రాణి ముఖార్జియా, పీటర్ ముఖార్జియాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
కార్తి చిదంబరం ఇంద్రాణి, పీటర్ ముఖార్జియాల నుంచి లంచం తీసుకున్నాడనేది ఆరోపపణ. ఇంద్రాణి, పీటర్ ముఖార్జియాలకు చెందిన ఐఎన్ఎక్స్ మీడియా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిబంధనలకు విరుద్ధంగా మారిషస్ నుంచి పెట్టుబడులు స్వీకరించిందనే విషయంపై విచారణలో కార్తి చిదంబరం ప్రాబల్యాన్ని వాడుకోవాలని చూశారనే ఆరోపణలు వచ్చాయి.
ముఖార్జియాలు ఇలా చేశారు...
ఐఎన్ఎక్స్ బ్యానర్ కింద పలు కంపెనీలను ప్రారంభించి పీటర్ ముఖార్జియా తన భార్య ఇంద్రాణి ముఖార్జియాను ముందు పెట్టారు. 2014 నాటికి ఆయన ఐఎన్ఎక్స్ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐఎన్ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఐపిఎం ఇన్కోన్ ప్రైవేట్ లిమిటెడ్, ఐఎన్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ సెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పలు సంస్థలను స్థాపించాడు.
వారు పూర్తిగా ఆమ్మేశారు
ఇంద్రాణి, పీటర్ 2012 ప్రాతంలో ఐఎన్ఎక్స్ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్లోని తమ వాటాను పూర్తిగా అమ్మేశారు. ఈ కంపెనీలో సింగపూర్ ప్రభుత్వానికి చెందిన టెమాసెక్ కూడా పెట్టుబడులు పెట్టింది. 2012 ఏప్రిల్ 24వ తేదీన షీనా బొరా హత్య జరగడానికి కొన్ని రోజు ముందు వరకు వారు ఐఎన్ఎక్స్లో పెట్టుబడిదారులుగా ఉన్నారు షీనా బోరా హత్య కేసులో వారిద్దరు జైలు పాలైన విషయం తెలిసిందే.
మరో కంపెనీ హెడ్గా....
2007లో ఇంద్రాణి మరో కంపెనీ ఐపిఎం ఇన్కోన్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతిగా వెళ్లారు ఈ కంపెనీకి రూ.10 కోట్లు రుణంగా ఇచ్చినట్లు సిబిఐ గుర్తించింది. దాన్ని ఐఎన్ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో వాటాలు కొనుగోలుచేయడానికి వాడారు.
వారిద్దరి మరో కంపెనీ ఇలా...
ఇంద్రాణి, పీటర్ ముఖార్జియా సంయుక్తంగా 2009లో ఐఎన్ఎక్స్ సెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించారు. అదే ఏడాది పీటర్ ముఖార్జియా తన భార్య, కో డైరెక్టర్ ఇంద్రాణి పేరు మీద రూ.10 కోట్ల రుణాన్ని అప్రూవ్ చేశారు. ఈ కంపెనీలో ఇంద్రాణి వాటా 99.9 శాతం, దాని షేర్ క్యాపిటల్ ఆసక్తికరంగా రూ.10 కోట్లు.
ఐఎన్ఎక్స్ సర్వీసిస్ కంపెనీ
ఇంద్రాణి, పీటర్ ముఖార్జియా ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద మరో కంపెనీ స్థాపించారు. దాని పెయిడ్ అప్ క్యాపిటల్ రూ.50 లక్షలు. ఇందులో ఇంద్రాణి వాటా 99.9 శాతం కాగా, మిగతా వాటా పీటర్ది. రూ.69 లక్షలు ఈ కంపెనీలోకి తరలించారు. వ్యాపార కార్యకలాపాలేవీ లేవు గానీ పీటర్, ఇంద్రాణిలకు మధ్య జరిగిన లావాదేవీలు మాత్రం ఉన్నాయి.
వడ్డీ లేకుండా రుణాలు...
ఆ రుణాల్లో దేనికి కూడా వడ్డీ లేదు. తిరిగి చెల్లించే విషయంలో ఏ విధమైన నిబంధనలు లేవు. దాంతో వారు మరెక్కడి నుంచో డబ్బులు వీటిలోకి తరలిస్తున్నారని దర్యాప్తు సంస్థలు అనుమానించాయి. రుణాలు చేతులు మారడం మాత్రమే కనిపిస్తోంది గానీ వ్యాపార కార్యకలాపాలు లేవు.
వారి కేసులో కార్తి చిదంబరం
పీటర్, ఇంద్రాణి ముఖార్జియాలు జరిపిన అక్రమ లావాదేవీలపై కేసులో దర్యాప్తును ప్రభావితం చేయడానికి కార్తీ చిదంబరం లంచం తీసుకున్నాడనేది సిబిఐ ఆరోపణ. ఈ కేసులోని సిబిఐ బుధవారం కార్తి చిదంబరాన్ని అరెస్టు చేసింది.