దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు తొలగించకుంటే... రైల్ రోకో: విహెచ్
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్కు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు తొలగించాల్సిందేనని, లేని పక్షంలో రైల్ రోకో నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విహెచ్ హనుమంతురావు కేంద్రానికి హెచ్చరించాడు.
గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ ఎంఐఎంకు ఎప్పుడో తలాక్ చెప్పేశామని అన్నారు. త్వరలో జరగనున్న జీహెచ్ ఎంసీ ఎన్నికవల్లో ఎంఐఎం ఎలాంటి పొత్తు ఉండదని విహెచ్ స్పష్టం చేశారు. పార్టీలోని ఒక నేతకు రెండు పదవులు సరికాదని అధిష్టానానికి విన్నవిస్తామని ఆయన తెలిపారు.
Comments
English summary
V Hanumanthu Rao demands remove ntr name in shamshabad airport domestic terminal in Hyderabad.