పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ పోరాటం భావి తరాల కోసమేనన్న విషయం అందరికీ స్పష్టం కావాలని వ్యాఖ్యానించారు.సభ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజ వేయొద్దని.. ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాష్ట్రం కోసం పోరాటం కొనసాగించాలని చెప్పారు.