కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు అధికారికంగా ఖరారు కానున్నారు. నే
Published : October 19, 2022, 01:00
కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు అధికారికంగా ఖరారు కానున్నారు. నేడు 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. మల్లిఖార్జున ఖర్గే - శశిథరూర్ పోటీ పడ్డారు. ఈ నెల 17న ఎన్నికలు జరగ్గా 96 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రోజున ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందు కోసం ఏఐసీసీ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ముందుగా అభ్యర్ధుల సమక్షంలో బ్యాలెట్ బాక్సును ఓపెన్ చేస్తారు. బ్యాలెట్లను కలగలపి కట్టలు కడతారు. ఆ తరువాత ఓట్లను లెక్కిస్తారు.