నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేసిన భువీ

Published : July 17, 2018 10:39 AM (IST)
England India Have to Play in Series Decider
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఇండియా రెండో సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్‌తో కీలకమైన మూడో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. సోమవారం నెట్స్‌లో తీవ్ర సాధన చేసింది. గాయంతో వన్డేలకు దూరమైన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తిరిగి జట్టుతో కలిసి సాధన చేశాడు. సహచరులకు బౌలింగ్‌ చేశాడు. మ్యాచ్‌లోపు అతడు ఫిట్‌ అయితే భారత్‌ ఎదుర్కొంటున్న డెత్‌ ఓవర్ల సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలున్నాయి.శార్దూల్‌ ఠాకూర్‌, ధోనీ, రైనాతో కలిసి భువి మైదానంలో సాధన చేశాడు. భువి రాకతో బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా మారినా మిడిలార్డర్‌ విభాగం మాత్రం సమస్యగానే కనిపిస్తోంది. తొలి వన్డేలో దుమ్ము దులిపేసిన టాప్‌ ఆర్డర్‌ రెండో వన్డేలో కుప్పకూలడంతో మిడిలార్డర్‌ వైఫల్యం మరోసారి బయటపడింది. ధోనీ చాలా నెమ్మదిగా ఆడాడు. రైనా ఫర్వాలేదనిపించాడు. ఇక మిగిలినవారు కనీసం సింగిల్స్‌ తీయడానికీ కష్టపడ్డారు.
Up Next
Recommended వీడియోలు
  • 30 minutes ago
    గుడివాడ పబ్లిక్ టాక్
  • 1 hour ago
    మేమంతా సిద్ధం
  • 13 hours ago
    ఆరంజ్ ఆర్మీ ఘన విజయం.. షాక్ లో కావ్య
  • 14 hours ago
    చేతులెత్తేసిన హార్దిక్ .. కెప్టెన్సీ చేసిన రోహిత్
  • 15 hours ago
    ఉప్పల్‌లో సిక్సర్ల సునామీ
  • 15 hours ago
    ట్రావిస్ హెడ్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన SRH
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా