By : Oneindia Telugu Video Team
Published : November 28, 2020, 07:20
Duration : 02:05
02:05
టీమిండియాకు మరో షాక్.. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20% కోత!
భారీ పరాజయం మూట గట్టుకుని పరువు పోగొట్టుకున్న టీమిండియాకు మరో దెబ్బ తగిలింది. శుక్రవారం సిడ్నీలో ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టు ఆటగాళ్లకు జరిమానా విధించారు. ఒక్కో ప్లేయర్ మ్యాచ్ ఫీజులో 20 శాతం చొప్పున కోత విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శనివారం ప్రకటించింది. బౌలింగ్ చేయడానికి కేటాయించిన సమయం కంటే.. ఎక్కువ సమయం తీసుకున్నందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20% కోత విధించింది ఐసీసీ.