By : Oneindia Telugu Video Team
Published : November 26, 2020, 03:40
Duration : 01:46
01:46
భారత ఆటగాళ్లను అస్సలు కవ్వించం.. స్లెడ్జింగ్ ఉండదు !
భారత్తో జరగనున్న అప్కమింగ్ సిరీసుల్లో తమ జట్టు నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు ఉండవని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. మాటల యుద్ధం జరగకుండానే ఇరు జట్ల మధ్య పోటీ తారస్థాయిలో ఉంటుందని తెలిపాడు. ఈ సిరీస్ల్లో ఎలాంటి స్లెడ్జింగ్ ఉండదని, ప్రత్యర్థుల జోలికే తాము పోమని ఈ ఆసీస్ కోచ్ స్పష్టం చేశాడు. నవంబర్ 27న మొదలయ్యే ఫస్ట్ వన్డేతో ఈ సుదీర్ఘ పర్యటన ఆరంభం కానుంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆసీస్ కోచ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.