By : Oneindia Telugu Video Team
Published : January 16, 2021, 01:00
Duration : 01:09
01:09
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 369 ఆలౌట్! 4 పరుగుల తేడాలో మూడు వికెట్లు....!!
టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటైంది. 274/5 ఓవర్ నైట్ స్కోర్తో రెండోరోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా.. మరో 95 పరుగులు చేసి చివరి 5 వికెట్లు కోల్పోయింది. టిమ్ పైన్ (50; 104 బంతుల్లో 6x4), కామెరూన్ గ్రీన్ (47; 107 బంతుల్లో 6x4) రాణించారు. తొలి రోజు ఆటలో మార్నస్ లబుషేన్ (108; 204 బంతుల్లో 9x4) శతకం సాధించిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్ మూడేసి వికెట్లు తీశారు.