ఇరాన్, పాక్ నుంచి భారత్కు గట్టి పోటీ: అజయ్ ఠాకూర్
Published : July 19, 2018 04:00 PM (IST)
ఇండోనేసియా రాజధాని జకార్తా వేదికగా ఆగస్టులో జరిగే ఆసియా గేమ్స్లో భారత కబడ్డీ జట్టు ఎనిమిదో స్వర్ణ పతకం సాధించడం ఖాయమని జట్టు కెప్టెన్ అజయ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశాడు. అయితే, ఆసియా గేమ్స్లో ఇరాన్, పాకిస్తాన్ జట్లనుంచి భారత్ గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.జకార్తా వేదికగా ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆసియా గేమ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత కబడ్డీ జట్టు కెప్టెన్ అజయ్ ఠాకూర్ మాట్లాడుతూ "ఆసియా గేమ్స్లో భారత కబడ్డీ పురుషుల, మహిళా జట్లు 8, 3వ స్వర్ణ పతకాలు సాధించడం ఖాయం" అని అన్నాడు."మనవాళ్లు స్థిరమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. ఎంత వత్తిడినైనా అధిగమించి ఆట సాగించగల సమర్థులు. కబడ్డీ మాస్టర్స్ దుబాయ్ 2018లో ఘన విజయం ఆటపై మరింత స్పిరిట్ పెంచింది. ఆసియా గేమ్స్లో ప్రధానంగా పాకిస్తాన్, ఇరాన్, కొరియా జట్లనుంచి బలమైన పోటీ ఎదురుకావొచ్చు. ఇప్పుడు మా లక్ష్యమంతా ఆసియా గేమ్స్లో స్వర్ణం సాధించడంపైనే" అని ఠాకూర్ అన్నాడు.
Up Next
02:49
ముంబై ఇండియన్స్ లక్ మామూలుగా లేదు..
16 hours ago
01:17
చెలరేగిన సూర్య కుమార్ యాదవ్.. తెలుగోడి సత్తా ఇది..
18 hours ago
01:19
ఈ ఐపీఎల్ ఆటగాళ్ళ సత్తకు పరీక్ష..
20 hours ago
01:54
గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్
2 days ago
01:12
ఛాంపియన్స్ కి చెమటలు పట్టించిన ఢిల్లీ గుజరాత్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్
2 days ago
01:55
చెలరేగిన జాస్ బట్లర్.. రాజస్థాన్ రాయల్స్ కి రాయల్ విక్టరీ..
3 days ago
01:34
శతక్కొట్టిన సునీల్ నరైన్.. రాజస్థాన్ పై విధ్వంసం..
3 days ago
01:01
ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఏదో శక్తి ఉంది..
3 days ago
01:11
మ్యాక్స్ వెల్ ని పక్కన పెట్టేసారు.. కారణం ఇదేనా..?