By : Oneindia Telugu Video Team
Published : November 04, 2019, 01:50
Duration : 01:57
01:57
డీఆర్ఎస్లో పంత్ విఫలం.. తలకొట్టుకున్న రోహిత్ !!
ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (42 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. లక్ష చేధనలో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ముష్ఫికర్ రహీమ్ (43 బంతుల్లో 60 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) విజయంలో కీలక పాత్ర పోషించాడు.