India Vs England 3rd ODI: ఇండియా బ్యాటింగ్ హైలైట్స్
Published : July 18, 2018 09:27 AM (IST)
హెడ్డింగ్లే వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. ఈ క్రమంలో లియామ్ ప్లంకెట్ వేసిన 23.4వ బంతికి బౌండరీ బాది హాప్ సెంచరీ చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 48వ హాఫ్ సెంచరీ. 25 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ (55), ధోని(2) పరుగులతో ఉన్నారు.
Up Next
01:38
లేట్ నైట్ పార్టీలు , సిట్టింగులు.. ఆ జట్లు చేసే పని ఇదే..