ధోనీ తడబడ్డాడు..అప్పటి నన్ను గుర్తు చేశాడు: సునీల్ గవాస్కర్
Published : July 17, 2018 10:43 AM (IST)
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మూడో వన్డే ఆడేందుకు సిద్ధమైనా.. రెండో వన్డేలో ఆటగాళ్ల ప్రదర్శనపై సోషల్ మీడియాలో విమర్శలు ఆగలేదు. ఇంగ్లాండ్తో శనివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో పేలవ బ్యాటింగ్తో నిరాశపరిచిన భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. 59 బంతులాడి రెండు ఫోర్లు కొట్టి 37 పరుగులు మాత్రమే చేశాడు.దీంతో.. ఈ మేటి 'ఫినిషర్' మునుపటిలా ఆడలేకపోతున్నాడని.. రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఈ విమర్శకుల జాబితాలోకి దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా చేరాడు. 1975లో ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా జరిగిన ప్రపంచకప్ మ్యాచ్లో సునీల్ గవాస్కర్ 174 బంతుల్లో ఒక ఫోర్ కొట్టి 36 పరుగులు మాత్రమే చేశాడు. చాలా కాలం తర్వాత ధోనీ ఆడిన అత్యంత ఇన్నింగ్స్లో ఇదొక దారుణమైన ఇన్నింగ్స్. తాజాగా లార్డ్స్ వేదికగానే ధోనీ విఫలమవడంతో గవాస్కర్ సరదాగా ఇలా స్పందించాడు.
Up Next
01:38
లేట్ నైట్ పార్టీలు , సిట్టింగులు.. ఆ జట్లు చేసే పని ఇదే..