ఇంగ్లాండ్తో మొదటి మూడు టెస్టులకు టీమిండియా జట్టు ఎంపిక
Published : July 19, 2018 06:42 PM (IST)
ఆతిథ్య ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరిస్ ముగిసింది. ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొదటి మూడు టెస్టులకు భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన టీమిండియాను బుధవారం సెలక్టర్లు ప్రకటించారు.యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు తొలిసారి టెస్టు జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు. వృద్ధిమాన్ సాహా గాయపడటంతో అతని స్థానంలో పంత్కు ఓ అవకాశం ఇచ్చారు. మరోవైపు దినేష్ కార్తీక్ను ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా ఎంపిక చేశారు. బొటన వేలి గాయంతో ఇంగ్లాండ్ టీ20, వన్డే సిరిస్కు దూరమైన బుమ్రాకు కూడా చోటు దక్కింది.