లీడ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో మూడు వన్డేల సిరిస్ను 2-1తేడాతో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఓటమికి కారణం కోహ్లీ ఎంపిక చేసిన తుది జట్టేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.మూడో వన్డేలో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్ స్థానంలో దినేశ్ కార్తీక్ తుది జట్టులో చోటు దక్కించుకోగా... మరోవైపు సిద్ధార్థ్ కౌల్, ఉమేశ్ యాదవ్ స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్ జట్టులోకి వచ్చారు.సిరిస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో కేఎల్ రాహుల్ను తప్పిస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత్ ఓటమికి కోహ్లీ నిర్ణయమే కారణమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.