రోహిత్ శర్మకు మాత్రమే సాధ్యమైన రికార్డ్ అది
Published : October 23, 2022, 03:50
2007లో ఈ మెగా క్రికెట్ ఈవెంట్ ఆరంభం కాగా..అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నింట్లోనూ అతని కాంట్రిబ్యూషన్ ఉంది. మొత్తంగా అతనికి ఇది ఎనిమిదో టోర్నమెంట్. 2007, 2009, 2010, 2012, 2014, 2016, 2021 సీజన్లల్లో ప్లేయర్గా ఆడాడు. తొలిసారి జట్టుకు నాయకత్వం వహిస్తోన్నాడు. విరాట్ కోహ్లీ నుంచి జట్టు పగ్గాలను అందుకున్నాడు రోహిత్ శర్మ. మెజారిటీ ద్వైపాక్షిక సిరీస్లను గెలుచుకున్నాడు. ఆసియా కప్ 2022 ఓటమి..అతనికి చేదు జ్ఞాపకం.