పార్టీ ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా బుట్టా రేణుక పేరును జాబితాలో చేర్చారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి, ఆ తర్వాత టీడీపీలో చేరిన బుట్టా రేణుకపై అనర్హత వేటు వేయాలని వైసీపీ రెండేళ్లుగా కోరుతోంది.విభజన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా రేపటి నుంచి పార్లమెంటు హాలులో వైసీపీ మాజీ ఎంపీలం నిరసన చేపడతామని విజయ సాయి రెడ్డి తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి బుట్టా రేణుకను ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఇది టీడీపీ, బీజేపు కుమ్మక్కుకు నిదర్శనం అన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్నాయని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి పార్లమెంటు సజావుగా సాగాలని లేదని విజయ సాయి రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని సమస్యలపై చర్చించాలన్న ఉద్దేశ్యం వారికి ఓ కోశాన లేదన్నారు. ఏపీకి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని అడ్రస్ చేయాలని మాత్రమే టీడీపీ విజ్ఞప్తి చేసిందని చెప్పారు.