ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డపై రెండు సిరీస్లు పూర్తి చేసుకున్న టీమిండియా.. మూడో సిరీస్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆగష్టు1 నుంచి ప్రారంభం కాబోతున్న టెస్టు సిరీస్కు ఏర్పాట్లు మొదలైయ్యాయి. దాని కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బుధవారం భారత జట్టును ఎంపిక చేయనుంది. పూర్తి సిరీస్కు జట్టును ఎంపిక చేస్తారా.. లేదా ముందు రెండు మూడు టెస్టులకు మాత్రమే జట్టును ప్రకటిస్తారా అనే విషయంపై స్పష్టత లేదు.