వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎల్లుండి దాడి చేస్తాం, దమ్ముంటే అడ్డుకోండి: ఆదిత్యనాథ్కు 'ఐసిస్' లేఖ!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) తీవ్రవాదుల నుంచి హెచ్చరికలు వచ్చినట్లుగా తెలుస్తోంది. బుధవారం నాడు ఐసిస్ పేరిట ఓ బెదిరింపు లేఖ వచ్చింది.
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) తీవ్రవాదుల నుంచి హెచ్చరికలు వచ్చినట్లుగా తెలుస్తోంది. బుధవారం నాడు ఐసిస్ పేరిట ఓ బెదిరింపు లేఖ వచ్చింది.
యూపీలోని వారణాసి జిల్లాలో ఈ లేఖ లభ్యమైంది. ఇందులో హిందీలో రాసి ఉంది. పూర్వాంచల్లో ఈ నెల 24వ తేదీన దాడులు జరుపుతామని అందులో చెప్పారు. అందులో పాకిస్తాన్ను ప్రశంసిస్తూ నినాదాలు రాశారు.
'పాకిస్తాన్ జిందాబాద్, 23-03-2017 రోజు పూర్వాంచల్లో దాడులు చేస్తాం. దమ్ముంటే ఎల్లుండి మేం జరిపే హింసను అడ్డుకోండి' అని రాసి ఉంది.
వారణాసి నుంచి ప్రధాని మోడీ ఎంపీగా ఉన్నారు. స్వయంగా ఆయన నియోజకవర్గం నుంచి లేఖ రావడం గమనార్హం. ఈ లేఖపై పోలీసులు సీరియస్గా ఆరా తీస్తున్నారు. లేఖకు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.
English summary
A purported ISIS threat letter was on Wednesday recovered from Varanasi district in Uttar Pradesh. The letter, written in Hindi, threatened of a massive attack in Poorvanchal on March 24. Slogans praising Pakistan were also inscribed on the letter. “Pakistan Zindabad. 24/3/17 ko Poorvanchal mein tabahi. Bacha sakte ho to bacha lo,” the letter read.
Story first published: Wednesday, March 22, 2017, 16:56 [IST]