పొలం పనికెళ్లిన బాలికపై గ్యాంగ్రేప్: ఒకరి అరెస్ట్
సీతాపూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిశ్వా ప్రాంతంలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. గడ్డి కోసేందుకు పొలంలోకి వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక స్పృహ కోల్పోవడంతో నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు.
కాగా, గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లిన బాలిక సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ క్రమంలో ఆమె కోసం గాలింపు చేపట్టారు. పొలంలో బాలిక అపస్మారక స్థితిలో ఉండటంతో ఆమెను ఇంటికి తరలించారు.
ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన బాధిత బాలిక.. జరిగిన టనను కుటుంబ సభ్యులకు వెల్లడించింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
నిందితుల్లో ఒకడైనా రోహిత్ అనే యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగితా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.