బిజినెస్మెన్ నాపై రేప్ చేశాడు: మహిళ, భార్య ఫిర్యాదుతో ట్విస్ట్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. తన పైన ఓ బిజినెస్మెన్, మరో ఇద్దరు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు స్థానిక పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. ఆ మహిళ వంట మనిషిగా పని చేస్తోంది.
మహిళ ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆమె పైన సాల్ట్ లేక్ లోకాలిటీ ప్రాంతంలో అత్యాచారం జరిగిందని చెప్పారు. ఫిబ్రవరి 23వ తేదీన రాత్రిపూట బిజినెస్మెన్, ఆయన డ్రైవర్, గేట్ మెన్ కలిసి అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆఫ్ బిదిన్ నగర్ దేబాషిష్ మాట్లాడుతూ.. బిజినెస్మెన్ భార్య అంతకుముందే అదే యువతి పైన ఫిర్యాదు చేసిందని చెప్పారు. తమను ఆ మహిళ రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని, లేదంటే తన భర్త పైన అత్యాచారం కేసు పెడతానని బెదిరించిందని ఆమె చెప్పారని తెలిపారు.