ఉత్తరాంధ్రలో కొత్త చరిత్ర- భోగాపురం ఎయిర్ పోర్టుపై చంద్రబాబు ప్రశంసలు..!

అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం చంద్రబాబు (chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్ పోర్టు నిర్మాణానికి సహకరించిన రైతులకు పాదాభివందనం చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. వారు ఉత్తరాంధ్రకు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదని, భవిష్యత్తు ఇచ్చారు. ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వచ్చాయన్నారు. రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తామని తాను, పవన్ కళ్యాణ్, మోడీ హామీ ఇచ్చామని, దాన్ని ఇప్పుడు నిలబెట్టుకున్నామని చంద్రబాబు గుర్తుచేశారు.

Advertisement

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయన్నారు. ఎర్రబస్సు రాదని విపక్షాలు చెప్పాయని, కానీ తాము ఎయిర్ బస్సు తెచ్చామన్నారు. వారు మాత్రం అడ్రస్ లేకుండా పోయాయన్నారు. ఉత్తరాంధ్ర ఆశలు, ఆకాంక్షల్ని తక్కువ చేశారని, అడ్డుపడ్డారని, అన్నీ అధిగమించి ఎయిర్ పోర్టు తీసుకురావడం ఉత్తరాంధ్రకు గర్వకారణం అన్నారు. గిరిజనులతో కలిసి స్వాతంత్ర పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును దేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు. ఉత్తరాంధ్ర శక్తికి ఈ ఎయిర్ పోర్టు నిదర్శనం అన్నారు. ఈ ఎయిర్ పోర్టు నిర్మించింది కూడా ఉత్తరాంధ్ర వాసి జీఎంఆర్ అన్నారు. అలాగే ఈ ఎయిర్ పోర్టుకు తొలి అడుగు వేసిన అశోక్ గజపతిరాజు, దీని నిర్మాణ బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడు కూడా ఉత్తరాంధ్ర వాసులే అన్నారు.

Advertisement