మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(mudragada padmanabham) అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన్ను చివరి చూపు చూసేందుకు వచ్చిన కుమార్తె క్రాంతి బార్లపూడిని కుటుంబ సభ్యులంతా కలిసి అడ్డుకున్నారు. దీంతో పోలీసుల సాయంతో ఆమె తండ్రి శవాన్ని దూరం నుంచి చూసి ఏడుస్తూ వెళ్లిపోయారు. అనంతరం వైసీపీ ప్రభావంతోనే కుటుంబ సభ్యులు ఇలా చేశారంటూ ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై ముద్రగడ కుమారులు బాలు, గిరిబాబు ఇవాళ ఓ లేఖ విడుదల చేశారు.
Advertisement