భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో ఊహించని విప్లవం తీసుకువచ్చిన యూపీఐ (UPI) ప్రస్తుతం సగటు భారతీయుడి దైనందిన జీవితంలో ఒక విడదీయరాని శక్తివంతమైన భాగమైపోయింది. జేబులో ఒక్క రూపాయి నోటు లేకపోయినా, చేతిలో కేవలం స్మార్ట్ఫోన్ ఉంటే చాలు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొని ప్రపంచాన్ని చుట్టేయగలమనే గట్టి నమ్మకాన్ని ఇది ప్రతి ఒక్కరికీ ఇచ్చింది.
ఉదయం లేచిన వెంటనే తాగే ఒక చిన్న కప్పు టీ నుంచి అర్ధరాత్రి వేళల్లో ఆస్పత్రి అత్యవసర ఖర్చుల వరకు నిత్యం కోట్లాది మంది నమ్ముకున్న ఈ అపూర్వమైన ఉచిత సేవలకు బ్రేక్ పడబోతుందా అనే ఆందోళన దేశవ్యాప్తంగా సామాన్యులలో మొదలైంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రతిపాదించిన నూతన చట్ట సవరణ ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
దేశంలో కోట్లాది మంది రోజూ వినియోగిస్తున్న యూపీఐ (UPI) చెల్లింపుల విధానంలో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.దేశ ఆర్థిక రంగాన్ని నియంత్రించే అత్యంత కీలకమైన చెల్లింపులు మరియు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టానికి (Payment and Settlement Systems Act) తగిన సవరణలు చేస్తూ ప్రభుత్వం పార్లమెంట్లో నూతన ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టింది.రూ.2,000కు పైబడిన యూపీఐ లావాదేవీలపై భవిష్యత్తులో ఛార్జీలు విధించే అవకాశానికి కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన మార్గాన్ని సుగమం చేసింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్కు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రతిపాదించిన సవరణల ప్రకారం, అవసరమైతే యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే అవకాశం కల్పించేలా చట్టాన్ని సవరించనుంది.అయితే,ప్రస్తుతం ఎలాంటి ఛార్జీలు అమల్లోకి రాలేదని,కేవలం భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు అవసరమైన చట్టపరమైన వ్యవస్థను మాత్రమే రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.రాయిటర్స్ కథనం ప్రకారం,ఈ అంశంపై ఇంకా ప్రభుత్వ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి.ఛార్జీల శాతం ఎంత ఉండాలి?ఏ లావాదేవీలకు వర్తించాలి?అనే విషయాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ప్రతిపాదనల ప్రకారం,రూ.2,000కు పైబడిన యూపీఐ లావాదేవీలపై 0.3 నుంచి 0.5 శాతం వరకు MDR విధించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.అయితే ఈ ఛార్జీలు నేరుగా వినియోగదారులపై కాకుండా,ఏటా రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలపై మాత్రమే వర్తించే అవకాశం ఉంది.దీంతో సాధారణ వినియోగదారులు అదనపు భారం ఎదుర్కొనే అవకాశాలు తక్కువగా ఉండగా,చిన్న దుకాణాలు,చిరు వ్యాపారులు ప్రస్తుతం ఉన్నట్లుగానే ఉచిత యూపీఐ సేవలను కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. ఇంకో ప్రతిపాదన ప్రకారం,ఒక్కో లావాదేవీ విలువ ఆధారంగా కాకుండా,వ్యాపార సంస్థ వార్షిక టర్నోవర్ ఆధారంగా MDR నిర్ణయించే విధానాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు చిన్న వ్యాపారులపై భారం పడకుండా చూసే దిశగా కేంద్రం వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది.ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతున్నాయి.MDR అమలుపై ప్రభుత్వం అధికారిక నిర్ణయం ప్రకటించే వరకు వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది.UPI చెల్లింపుల విధానంలో కీలక మార్పులు
నేడు నిర్మలమ్మ కీలక ప్రకటన! మారనున్న డిజిటల్ బ్యాంకింగ్ రూల్స్
యూపీఐ ఛార్జీల వెనకున్న అసలు ప్రతిపాదనలు
నగదు పెరుగుతోంది…యూపీఐ దూసుకుపోతోంది:భారత ఆర్థిక వ్యవస్థలో మార్పు