KTR:హైకోర్టులో కేటీఆర్‌కు భారీ ఊరట - అలాంటి పిటిషన్లపై ధర్మాసనం సీరియస్..!!

మాజీమంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.సిరిసిల్లా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.ఈ తీర్పుపై కేటీఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చట్టబద్ధంగా ఎదుర్కోలేక,వ్యక్తిగత కక్షలతోనే కోర్టులను ఆశ్రయిస్తున్నారనే వాదనలకు ఈ నిర్ణయంతో గట్టి జవాబు లభించినట్లయిందని పార్టీ క్యాడర్ పేర్కొంది.

Advertisement

గత ఎన్నికల్లో కేటీఆర్ చేతిలో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఈ సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరలేపారు.నామినేషన్ అఫిడవిట్‌లో కేటీఆర్ తన ఆస్తులు,అప్పుల వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ ఎన్నికల పిటిషన్ గత కొద్దికాలంగా రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టించడమే కాకుండా,ఇరు పార్టీల నాయకుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది.

Advertisement

కోర్టు ముందుకు వచ్చిన ఆరోపణలు ఇవే..

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఒక నివాస భవనాన్ని కేటీఆర్ తన ఆస్తిగా చూపించలేదని పిటిషనర్ ఆరోపించారు. దాదాపు రూ.10.50 లక్షలు, రూ.88.15 లక్షల రుణాలకు సంబంధించిన వివరాల వెల్లడిలో కూడా అస్పష్టత ఉందని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేటీఆర్ కుమారుడి పేరిట జరిగిన భూముల కొనుగోళ్లు, కుటుంబ సభ్యుల పేరిట ఉన్న మరికొన్ని ఆస్తుల వివరాలను కూడా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో దాచిపెట్టారంటూ మహేందర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

కేటీఆర్ మళ్లీ అమెరికా వెళ్లాల్సిన టైమ్ వచ్చేసింది..!
Advertisement

న్యాయస్థానం ఏం చెప్పిందంటే..

ఈ సుదీర్ఘ వాదనలను సునిశితంగా పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు మంగళవారం కీలక తీర్పును వెలువరించారు. కేవలం అభ్యర్థి అర్హతలపై అనుమానాలతో ఆధారాలు లేకుండా దాఖలు చేసే పిటిషన్లను అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం సరైన ఆధారాలు ఉంటేనే ఎన్నికల పిటిషన్‌ను విచారించాల్సి ఉంటుందని గుర్తు చేస్తూ, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు లోబడే ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఛార్జిషీట్ ఆ సూసైడ్ నోట్ - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

రాజకీయంగా ఎన్నో వ్యక్తిగత ఆరోపణలు, విమర్శల మధ్య నలిగిన ఈ కేసు చివరకు వీగిపోవడంతో కేటీఆర్ అభిమానులకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది. ప్రజాసేవ చేస్తున్న తమ నేతపై ప్రత్యర్థులు చేసిన బురదజల్లే ప్రయత్నాలు చివరకు పటాపంచలయ్యాయని బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చారిత్రక తీర్పుతో సిరిసిల్ల ఓటర్ల పవిత్రమైన తీర్పును న్యాయస్థానం గౌరవించినట్లయిందని స్థానిక ప్రజలు భావిస్తున్నారు.

English Summary

Telangana High Court dismisses the election petition against BRS Working President KTR over his Sircilla MLA election, giving him major legal relief.