అమరావతిలో దేశంలోనే మొదటి AI ప్లస్ క్యాంపస్..!!
దేశంలోనే తొలి ఏఐ యూనివర్సిటీ అమరావతి కేంద్రంగా ఏర్పాటు కానుంది. ఈ మేరకు కసరత్తు మొదలైంది. ఏపీ ప్రభుత్వం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు పైన ఇప్పటికే ప్రకటన చేసింది. కాగా, తాజాగా అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్-బిట్స్ విశ్వవిద్యాలయ కులపతి.. పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా ప్రకటించారు. రానున్న రెండేళ్ల కాలంలో అందుబాటులోకి రానుంది.
ఏపీ రాజధాని అమరావతికి మరో అరుదైన ఘనత దక్కింది. అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు కానుంది. 7000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతా మని కుమార మంగళం బిర్లా వెల్లడించారు. అమరావతి క్యాంపస్ను ఆధునిక సాంకేతిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కృత్రిమ మేథ, డేటాసైన్స్, రోబోటిక్స్, కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులకు ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. కాగా, రెండు దశల్లో ఏడు వేల మంది విద్యార్ధులకు అవకాశం కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు.

దేశంలో ఇప్పటివరకు ఎక్కడా ఇలాంటి క్యాంపస్ లేదని ఆయన తెలిపారు. దేశంలో ఉన్నతవిద్య దిశను మార్చేందుకు తొలి అడుగుగా ఈ క్యాంపస్ను తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలో రెండే ళ్లు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో రెండేళ్లు అభ్యసించేలా డిజైన్ చేస్తున్నామని జాయింట్ పీహెచ్డీలు చేయొచ్చని బిర్లా వివరించారు.
#BITScomingToAP
— N Chandrababu Naidu (@ncbn) July 14, 2025
I thank Mr Kumar Mangalam Birla, Chairman of the Aditya Birla Group and Chancellor of BITS, for taking a bold step to transform higher education in India with the announcement of the AI Plus Campus in Andhra Pradesh. This first-of-its-kind campus will be a… pic.twitter.com/s4zveKPJ7B
అమరావతి క్యాంపస్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ కాబోతోంద ని కంప్యూటర్ సైన్సులోని అన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ అక్కడ ఉంటాయని ఉపకులపతి రామ గోపాలరావు చెప్పారు. వివిధ మైనర్ ప్రోగ్రామ్స్ను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రంగాల కోర్సులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఐవోటీ, ఏఐ ఆధారిత సేవలతో డిజిటల్ ఫస్ట్ క్యాంపస్ రూపు దిద్దుకుంటుందని వివరించారు. క్యాంపస్ ఏర్పాటుకు సీఐర్డీఏ 70 ఎకరాలు కేటాయించింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications