CBSE: సీబీఎస్ఈ బోర్డు కీలక మార్పులు- 10వ తరగతిలో ఇలా... 12వ తరగతిలో అలా...
విద్యారంగంలో వస్తున్న పెనుమార్పుల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రాధమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ) పది, పన్నెండు తరగతుల్లో బోధిస్తున్న సబ్జెక్టుల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తాజాగా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సెకండరీ, హయ్యర్ సెకండరీ అకడమిక్ ఫ్రేమ్వర్క్లో తాజాగా గణనీయమైన మార్పులను ప్రతిపాదించినట్లు సీబీఎస్ఈ వెల్లడించిందని జాతీయ పత్రిక ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది.
దీని ప్రకారం 10వ తరగతిలో ప్రస్తుతం ఉన్న రెండు భాషా సబ్జెక్టుల నుంచి మూడు బాషలకు పెంచనున్నారు. అందులోనూ కనీసం రెండు బాషలు తప్పనిసరిగా స్థానికంగా ఉండాలని నిబంధన పెట్టనుంది. దీంతో 10వ తరగతి విద్యార్థులు ఇప్పుడు మూడు భాషలు, ఏడు సబ్జెక్టులతో కలిపి మొత్తం 10 సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అలాగే 12వ తరగతికి సంబంధించి చేస్తున్న మార్పుల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న ఒక భాష నుంచి రెండు బాషలకు పెంచారు. ఇందులో ఒకటి కనీసం తప్పనిసరిగా స్థానిక భారతీయ భాష అయి ఉండాలి.

పాఠశాల విద్యలో జాతీయ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ను అమలు చేయడానికి సీబీఎస్ఈ ఈ మార్పులు ప్రతిపాదిస్తోంది. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించిన విధంగా రెండు విద్యా వ్యవస్థల మధ్య మారడాన్ని సులభతరం చేయడం ద్వారా వృత్తి, సాధారణ విద్యల మధ్య అకడమిక్ సమానత్వాన్ని నెలకొల్పడం దీని లక్ష్యంగా చెబుతోంది.
ప్రస్తుతం ప్రామాణిక పాఠశాల పాఠ్యాంశాల్లో అధికారిక క్రెడిట్ వ్యవస్థ లేదు. సీబీఎస్ఈ ప్రణాళిక ప్రకారం ఒక విద్యా సంవత్సరం 1200 నోషనల్ లెర్నింగ్ గంటలతో రూపొందించారు . ఇది 40 క్రెడిట్లను సంపాదించడానికి అనుమతి ఇస్తుంది. నోషనల్ లెర్నింగ్ అనేది ఒక సగటు విద్యార్థి పేర్కొన్న ఫలితాలను సాధించడానికి వెచ్చించాల్సిన నిర్ణీత సమయాన్ని సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రతి సబ్జెక్టుకు నిర్దిష్ట సంఖ్యలో గంటలు కేటాయించారు.తద్వారా ఒక సంవత్సరంలో ఒక విద్యార్థి పాస్ అయినట్లు ప్రకటించడానికి మొత్తం 1200 లెర్నింగ్ గంటలను వెచ్చిస్తారు.
ప్రస్తుత సబ్జెక్టుల జాబితాకు మల్టీడిసిప్లినరీ, వృత్తి విద్యా కోర్సులను జోడించడం ద్వారా సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్యలో చదివే సబ్జెక్టుల సంఖ్యను పెంచాలని బోర్డు ప్రతిపాదిస్తోంది. కాబట్టి 10వ తరగతి విద్యార్థులు ప్రస్తుతం ఐదు సబ్జెక్టులలో (రెండు భాషలు మరియు గణితం, సైన్స్ మరియు సాంఘిక శాస్త్రం యొక్క మూడు ప్రధాన సబ్జెక్టులు) ఉత్తీర్ణత సాధించవలసి ఉంటుంది, వారు క్రెడిట్ సిస్టమ్ కింద 10 సబ్జెక్టులను (మూడు భాషలు మరియు ఏడు ప్రధాన సబ్జెక్టులు) క్లియర్ చేయాలి.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications