DSC: రేపట్నుంచి డీఎస్సీ అప్లికషన్లు, టీఆర్టీ రోస్టర్ విడుదల: నెల రోజులే గడువు
హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల(DSC-2023)కు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా 33 జిల్లాల వారీగా టీచర్ పోస్టులకు విద్యాశాఖ రోస్టర్ ఖాళీలను విడుదల చేసింది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 21 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, మున్సిపల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు (SA), (SGT), భాషా పండితులు (Pandit), వ్యాయామ ఉపాధ్యాయ (PET) ఉద్యోగాలు ఉన్నాయి.
వీటికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారం ప్రారంభం అవుతుంది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 21న ముగియనుంది. పరీక్షను నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 5089
స్కూల్ అసిస్టెంట్ 1739
లాంగ్వేజ్ పండిట్ 611
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 164
సెకండరీ గ్రేడ్ టీచర్ 2575
అప్లికేషన్ ఫీజు: రూ.1000
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 20
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 21
ఆన్లైన్ రాత పరీక్ష: నవంబర్ 20 నుంచి 30 వరకు
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://schooledu.telangana.gov.in సంప్రదించవచ్చు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications