తెలంగాణ గ్రూప్-2 పరీక్ష తేదీలు ఖరారు: ఎప్పుడంటే?
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-2 నియామక పరీక్ష తేదీలు ఖరారయ్యాయు. ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెల్లడించింది. ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ (ఓఎంఆర్) పద్ధతిలోనే పరీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలో విడుదల చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
780కిపైగా గ్రూప్ 2 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో ఉద్యోగానికి గరిష్ఠంగా 705 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నందున ఈ రెండు తేదీల్లో పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్ని విద్యాసంవత్సరాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇరిగేషన్కు 5,950 మంది వీఆర్ఏలు: లష్కర్లుగా
రెవెన్యూ శాఖలోని 21 వేల మందికిపైగా ఉన్న వీఆర్ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్)ల నుంచి దాదాపు 5,950 మందిని నీటిపారుదల శాఖలో సర్దుబాటు చేసేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేస్తోంది. వీఆర్ఏలను నీటిపారుదల శాఖలో లష్కర్లుగా నియమించి, పే స్కేల్ వర్తింపజేయాలని ఆ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో భారీగా నిర్మిచిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో వీఆర్ఏల సేవలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
నీరు వృథా పోకుండా ఇప్పటికే టెయిల్ ఎండ్, వారబంది విధానాలతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణానికి సాగులోకి తెచ్చేందుకు విజయవంతంగా కృషి చేస్తోంది. ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణకు సాగునీటి పారుదల శాఖను పునర్ వ్యవస్థీకరించింది. అందులో భాగంగా ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగాన్ని ఏర్పాటుచేసి ఇంజినీర్ ఇన్ చీఫ్ను కూడా నియమించింది. ఇప్పుడు ఆ విభాగం ప్రాజెక్టుల నిర్వహణకు లష్కర్లను నియమించాలని నిర్ణయించింది.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications