ఆ దేశానికి వెళ్లొద్దు, ఖర్చు పెట్టొద్దు - ఎందుకో తెలుసుకోండి !
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ సోషల్ మీడియా వేదికగా ఓ దేశంపై నిప్పులు చెరిగారు. విహార యాత్రలకు ఇకపై ఆ దేశానికి వెళ్లొద్దని.. ఇన్నాళ్లు వారికి టూరిజం పేరుతో ఆ దేశంలో బిలియన్ డాలర్లు చేస్తుంటే.. వారు ఈ తరహాగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి దేశాలకు భారతీయులు వెళ్లాల్సిన అవసరం లేదని హితవు పలికారు. దీంతో ఈ పోస్ట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
టర్కీ దేశంపై ఫైర్..
ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్థాన్లోని ఉగ్రవాదులు, వారి స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా "ఆపరేషన్ సిందూర్ " చేపట్టింది భారత ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు మృతి చెందడం, పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగడం.. భారత్ తిరిగి సరైన రీతిలో బుద్ది చెప్పడం జరిగింది. ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో పాక్కు మద్దతుగా టర్కీ నిలిచింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను ఎర్డోగాన్ కలిసి వారితో సత్సంబంధాలు కొనసాగిస్తామని టర్కీ ప్రెసిడెంట్ ఎర్గోడాన్ తెలిపారు.

పాకిస్థాన్ కి వత్తాసు పలకడమే కాకుండా పహల్గాం ఉగ్రదాడిని ఖండించకపోవడం గమనార్హం. మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు పట్ల కూడా సానుభూతి వ్యక్తం చేయకపోయవడం విమర్శలకు దారి తీసింది. దీనిపై హీరో నిఖిల్ ఫైరయ్యారు. ఇకపై ఎవరూ కూడా టర్కీని సందర్శించవద్దని భారతీయులను కోరారు. టర్కీలో భారతీయులు ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తారని వ్యాఖ్యానించారు.
భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం ఇకపై డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు నిఖిల్. విహారయాత్రల కోసం అలాంటి దేశాలకు వెళ్లొద్దని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ విదేకగా ఇది చదవండి అంటూ ఓ ఆర్టికల్ ని సైతం షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది. పాకిస్తాన్కు మద్దతుగా నిలిచిన దేశాల్లో టర్కీ, చైనా ఉన్నాయి. ఇప్పటికే టర్కీ యాపిల్స్ను సైతం దిగుమతి చేయడాన్ని భారత ప్రభుత్వం ఆపేసింది.
Anyone still visiting Turkey ? Please read this Below Thread...
— Nikhil Siddhartha (@actor_Nikhil) May 14, 2025
Indians Spend Billions of Dollars Every year in Turkey.
Please Stop giving your money to the Nations who are against us. #Tourism #India https://t.co/hUGq6MP6Pm
మరోవైపు నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో "స్వయంభూ" మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా చేస్తుండగా.. పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications