వేడుక: ములాయం ఫ్యామిలీతో మోడీ(పిక్చర్స్)
సైఫాయి: సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్కు వరసకు మనవడైన తేజ్ప్రతాప్ సింగ్, ఆర్జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రాజలక్ష్మిల వివాహానికి ముందు శనివారం జరిగిన ‘తిలక్' కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ వేడుకలో రాజకీయ ప్రముఖులు తమ ప్రత్యర్థులతో కలిసి నవ్వులు చిందిస్తూ మాట్లాడుతకోవడం విశేషం.
ప్రధానమంత్రి రాకలో ఎలాంటి రాజకీయం లేదని మైన్పురినుంచి సమాజ్వాది పార్టీ ఎంపి అయిన తేజ్ప్రతాప్ చెప్పారు. తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసి ఆశీస్సులు అందజేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు.
వేడుకలో మోడీ
సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్కు వరసకు మనవడైన తేజ్ప్రతాప్ సింగ్, ఆర్జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రాజలక్ష్మిల వివాహానికి ముందు శనివారం జరిగిన ‘తిలక్' కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు.
వేడుకలో మోడీ
లాలూ, ములాయం మధ్య కూర్చున్న మోడీ ములాయం కుటుంబసభ్యులతో కలిసి ఫోటో కూడా దిగడమే కాకుండా పెళ్లికుమారుడిపై పూలు చల్లి ఆశీర్వదించారు. ప్రధాని దాదాపు 45 నిమిషాల సేపు కార్యక్రమంలో గడిపారు.
వేడుకలో మోడీ
ప్రధానమంత్రి రాకలో ఎలాంటి రాజకీయం లేదని మైన్పురినుంచి సమాజ్వాది పార్టీ ఎంపి అయిన తేజ్ప్రతాప్ చెప్పారు. తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసి ఆశీస్సులు అందజేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు.
వేడుకలో మోడీ
ఈ వేడుకలో రాజకీయ ప్రముఖులు తమ ప్రత్యర్థులతో కలిసి నవ్వులు చిందిస్తూ మాట్లాడుతకోవడం విశేషం.
వేడుకలో మోడీ
ములాయం సింగ్, లాలూప్రసాద్లు మోడీని ఇటీవలి కాలంలో తీవ్రంగా విమర్శించిన వారే అయినప్పటికీ ఈ ముగ్గురూ చిరునవ్వులూ చిందిస్తూ ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చారు.
ములాయం సింగ్, లాలూప్రసాద్లు మోడీని ఇటీవలి కాలంలో తీవ్రంగా విమర్శించిన వారే అయినప్పటికీ ఈ ముగ్గురూ చిరునవ్వులూ చిందిస్తూ ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్నాయక్తో కలిసి ఆదివారం ఉదయం 10.45 గంటలకు కార్యక్రమానికి విచ్చేసిన మోడీకి లాలూప్రసాద్ , ములాయంలు ప్రత్యేకంగా అలంకరించిన వేదిక వద్ద స్వాగతం పలికారు.
యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ములాయంలు ప్రధానిని వేదిక వద్దకు తీసుకువెళ్లగా ములాయం ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు. లాలూ, ములాయం మధ్య కూర్చున్న మోడీ ములాయం కుటుంబసభ్యులతో కలిసి ఫోటో కూడా దిగడమే కాకుండా పెళ్లికుమారుడిపై పూలు చల్లి ఆశీర్వదించారు. ప్రధాని దాదాపు 45 నిమిషాల సేపు కార్యక్రమంలో గడిపారు. ఫిబ్రవరి 26న న్యూఢిల్లీలో ‘తేజు', రాజలక్ష్మిల వివాహం జరగనుంది.